ఈ శనివారం వరుథిని ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట సిరి సంపదలు ఖాయం

ఈ శనివారం వరుథిని ఏకాదశి.. ఇలా చేస్తే మీ ఇంట సిరి సంపదలు ఖాయం

హిందు సంప్రదాయం ప్రకారం.. ఏకాదశి తిథిని చాలామంది ఎంతో పవిత్రంగా,ఒక పండుగలా భావిస్తారు. అందులో ముఖ్యంగా వరూథిని ఏకాదశి రోజు నాడు అయితే ఏ పనులు చేసిన కూడా గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. కనుక ఆ రోజున ఏయే వస్తువులను దానం చేయాలో, ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందు సంప్రదాయం ప్రకారం.. ఏకాదశి తిథిని చాలామంది ఎంతో పవిత్రంగా,ఒక పండుగలా భావిస్తారు. అందులో ముఖ్యంగా వరూథిని ఏకాదశి రోజు నాడు అయితే ఏ పనులు చేసిన కూడా గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. కనుక ఆ రోజున ఏయే వస్తువులను దానం చేయాలో, ఏ పనులు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

భారతదేశంలోని హిందు సంప్రదాయం ప్రకారం.. ప్రతిఒక్క పండుగాకు, కొన్ని ప్రత్యేకమైన విశిష్టతలు ఆచారాలు ఉంటాయి. అలాగే తిథులకు కూడా కొన్ని విశిష్టతలు కలిగివుంటాయి. అందులో ముఖ్యంగా ఏకాదశి నాటు అంటే మన హిందువులకు ఎంత పవిత్రమైనదో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. ఏకాదశి అనేది మహా విష్ణఉకు ఎంతో ఇష్టమైన తిథిగా చెబుతుంటారు. ముఖ్యంగా దీనిలో వరుధిని అనేది అత్యంత పవిత్రమైన రోజని వేద పండితులు చెబుతుంటారు. కనుక ఆ రోజున ఏ చిన్న పనిచేసిన అది మనకు ఎంతో గొప్ప ఫలితాలను కలిగేలా చేస్తుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. మరి, అలాంటి వరుథిని ఏకాదశి రోజున ఏదీ దానం చేయండం గొప్ప విశిష్ట ఫలితాలను ఇస్తుందో.. జ్యోతిష్య నిపుణులు తాజాగా వెల్లడించారు. అయితే మే 4వ తేదీన శనివారం రాబోయే  వరుథిని ఏకాదశి రోజున ఏయే వస్తువులను దానం చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.

హిందు సంప్రదాయం ప్రకారం.. ఏకాదశి తిథిని చాలామంది ఎంతో పవిత్రంగా,ఒక పండుగలా భావిస్తారు. అందులో ముఖ్యంగా వరూథిని ఏకాదశి రోజు నాడు అయితే ఏ పనులు చేసిన కూడా గొప్ప ఫలితాలను ఇస్తుందని చెబుతుంటారు. మరి ఈ ప్రంపంచాన్ని పోషించే శ్రీ మహా విష్ణువు అవతారమైన వామన అవతారాన్ని పూజించే సంప్రదాయం కూడా ఉంది. కనుక ఆ రోజున ఆచరాల ప్రకారం.. శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుంచి విముక్తి లభిస్తుందని అందరూ విశ్వసిస్తారు. అంతేకాకుండా.. ఆర్ధిక ఇబ్బందుల్లో బాధపడేవారు కొన్ని వస్తువులను బ్రాహ్మణులకు దానం చేసి దక్షిణ తాంబూలాలు ఇవ్వాలని పండితులు సూచిస్తున్నారు. అయితే వరుథిని ఏకాదవి రోజున చేయాల్సిన పనలు చేయాలి, వేటిని దానం చేయాలో తెలుసుకుందా.

అన్న వితరణ

 వరుథిని ఏకాదశి నాడు ఎవరికైనా అన్నదానం చేయడం వల్ల  దేవతలు, పూర్వీకులు మొదలైన వారంతా సంతృప్తి చెందుతారు. కనుక వరుథిని ఏకాదశి రోజున అన్నదానం చేయడం వల్ల చాలా శుభఫలం లభిస్తుంది. ముఖ్యంగా అన్నపూర్ణ దేవి ఈ రోజున అన్నదానం చేయడం వలన చాలా సంతోషిస్తుంది. దీని వల్ల మీ ఇంట్లో సిరి సంపదలకు వెదజల్లుతాయి. అలాగే, మీ ఇంట్లో సుఖ శాంతులు కూడా  ఉంటాయి.

దాహార్తిని తీర్చడం

ఇక వరుథిని ఏకాదశి నాడు నీటితో నింపిన మట్టి కుండను దానం చేయడం చాలా మంచిది. ఈ రోజున బాటసారులకు నీరు ఇచ్చినా శుభఫలితాలు లభిస్తాయి. అలాగే మీ పిల్లలు దీర్ఘాయుష్షు పొందుతారని, వారికి ఎలాంటి సమస్యలు ఉండవని నమ్మకం.

నువ్వుల దానం

అలాగే ఏకాదశి రోజున నల్ల నువ్వులను నీటిలో వదలడం వల్ల శ్రీ హరి, శనిస్వరుడు ఎంతో సంతోషిస్తారని చెబుతారు. అదే సమయంలో ఆ రోజున నువ్వులతో చేసిన స్వీట్లను దానం చేయడం వల్ల పూర్వీకుల అనుగ్రహం లభిస్తుంది.

సత్తు పిండి దానం

ఇక సత్తు అంటే వేయించిన శనగల పొడ. ఇది చైత్ర, వైశాఖ మాసంలో వేసవికాలం ఉచ్ఛస్థితిలో ఉంటుంది. అటువంటి పరిస్థితిలో వరుథిని ఏకాదశి నాడు సత్తు దానం చేయడం చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. దీనివల్ల ధనలాభం చేకూరుతుందని, అదృష్టం పెరుగుతుందని నమ్ముతారు.

పండ్ల దానం

ఏకాదశి తిథి విష్ణువుకు అంకితం చేయబడింది.  కనుక ఆ రోజున  ఆకలితో  ఉన్నవారికి అరటి, మామిడి పండ్లను లేదా ఇతర పండ్లను దానం చేయవచ్చు. ఇది పితృ దోషం నుంచి బయటపడటానికి సహాయపడుతుందని నమ్ముతారు. పైగా శని దోష నివారణ జరుగుతుందని విశ్వాసం.

పాదరక్షలు, చెప్పుల దానం

అలాగే ఏకాదశి రోజున బూట్లు, చెప్పులు, గొడుగును కూడా దానం చేయవచ్చు. ఈ రోజున ఎవరైనా ఆపదలో ఉండే వారికి సహాయం చేస్తే.. వారిపై శ్రీ మహా విష్ణువు, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. ప్రతి కష్టం నుంచి విముక్తి లభిస్తుందని నమ్మకం.

ధనాన్ని దానం చేయడం

దీంతో పాటు వరుథిని ఏకాదశి రోజున ధనాన్ని దానం చేయడం కూడా శుభప్రదంగా పరిగణించబడుతుంది. వరుథిని ఏకాదశి రోజున ఎవరైనా దేవాలయంలో గాని, ఏదైనా ధర్మకార్యానికి గాని తమ శక్తి మేరకు ధనాన్ని విరాళంగా ఇస్తే చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు.

వస్త్రదానం

అన్నిటికన్నా వరుథిని ఏకాదశి రోజున వస్త్రదానం చేయడం కూడా మంచిదని భావిస్తారు. ఈ రోజున ఆలయంలో దేవుని పాదాల వద్ద వస్త్రాలు సమర్పించి, ఆ వస్త్రాలను అవసరమైన వారికి దానం చేయాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ఐశ్వర్యం వస్తుంది.

పూలను దానం చేయడం

ముఖ్యంగా పసుపు పువ్వులు విష్ణువుకు చాలా ఇష్టం. కనుక వరుథిని ఏకాదశి రోజున మహావిష్ణువుకు బంతి పువ్వులను సమర్పించి, ఆ తర్వాత కొన్ని పుష్పాలను కూడా దానం చేయండి. ఇక్కడ పుష్పాలను దానం చేయడం అంటే దేవాలయంలో దేవుడి సేవలో పూలను ఉంచడం. ఇలా చేయడం వల్ల దాంపత్య జీవితంలో మధురానుభూతి మిగులుతుంది.

అయితే  చైత్ర మాసంలోని కృష్ణ పక్ష ఏకాదశి తేదీని.. వరుథిని ఏకాదశిని,  బరుతని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజు హిందువులకు అత్యంత పవిత్ర పర్వదినం. ఆ రోజున ఆచారాల ప్రకారం శ్రీమహావిష్ణువు ఐదవ అవతారమైన వామనుని పూజించిన వారికి భయం నుండి విముక్తి లభిస్తుందని నమ్ముతారు. కనుక ఆరోజున ఉదయం నిద్రలేచి స్నానాదులు ముగించుకోని,దేవుడికి ప్రత్యేకంగాపూజలు చేయాలి, విష్ణుదేవుడికి ప్రత్యేకంగా ఈరోజున రకరకాల  పూలతో పాటు ఎర్రటి పూలు కూడా సమర్పించాలి. అలాగే ఈ ఏకాదశి రోజున అందుబాటులో ఉన్న ఫలాలను నైవేద్యంగా సమర్పించాలి.  కాగా, ఈఏడాది ఈ వరుథిని ఏకాదశి అనేది మే 4వ తేదీ శనివారం రాబోతుంది. అయితే ఆ రోజున పెళ్లి కానీ వారు, ఆర్థికసమస్యలతో సతతతమయ్యేవారు కొన్ని పరిహారాలు పాటించాలంటూ కూడా పండితులు చెబుతున్నారు. అంతేకాకుండా.. ఆరోజున రుక్మిణి, క్రిష్ణుడి వివాహావిధానం చదవాలి. అంతేకాకుండా సత్యనారాయణ పూజ వ్రతకథ చదివిన కూడా మంచి ఫలితం కల్గుతుంది. ముఖ్యంగా..  వరుథిని ఏకాదశి వ్రతం కూడా చేస్తే, అతి తక్కువ కాలంలోనే అలాంటి వారి జీవితంలో మంచి అద్భుతాలు సంభవిస్తాయని పండితులు చెబుతుంటారు.

Show comments