T20 World Cup 2024 Four Players Not Selected: వరల్డ్ కప్ కోసం మరో కొన్ని గంటల్లో టీమ్ ప్రకటించే అవకాశం! ఆ నలుగురికి నో ఛాన్స్!

వరల్డ్ కప్ కోసం మరో కొన్ని గంటల్లో టీమ్ ప్రకటించే అవకాశం! ఆ నలుగురికి నో ఛాన్స్!

టీ20 వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే స్క్వాడ్​లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని చెప్పాలి. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్ కప్​లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో ప్రకటించనున్నారు. అయితే స్క్వాడ్​లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని చెప్పాలి. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు చూద్దాం..

ప్రతిష్టాత్మక టీ20 వరల్డ్ కప్​కు ఇంకా నెల సమయం కూడా లేదు. దీంతో అన్ని దేశాలు తమ ఆటగాళ్లను మెగా టోర్నీ కోసం సన్నద్ధం చేస్తున్నాయి. చాలా కంట్రీస్ ప్లేయర్స్ ఐపీఎల్​లో ఆడుతూ బిజీబిజీగా ఉన్నారు. ఇదే ప్రాక్టీస్​తో వాళ్లు మెగా టోర్నీకి వెళ్లనున్నారు. ఈ రెండ్రోజుల్లో అన్ని దేశాలు తమ స్క్వాడ్స్​ను ప్రకటించే అవకాశం ఉంది. పొట్టి ప్రపంచ కప్​లో ఆడే భారత జట్టును మరికొన్ని గంటల్లో అనౌన్స్ చేయనున్నారు. దీంతో ఎవరెవరికి అవకాశం లభిస్తుంది? స్క్వాడ్​లో ఎవరెవరు ఉంటారో తెలుసుకునేందుకు అందరూ ఎగ్జయింట్​గా ఉన్నారు. అయితే టీమ్​లో ఆ నలుగురికి అవకాశం లేనట్లేనని తెలుస్తోంది. ఎవరా నలుగురు అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్ కప్ టీమ్​లో నలుగురు స్టార్లకు ఛాన్స్ లేనట్లేనని తెలుస్తోంది. అందరూ అనుకుంటున్నట్లే ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యాకు ప్రపంచ కప్​ టికెట్ దక్కలేదట. అయితే పాండ్యాతో పాటు మరో ముగ్గురికి కూడా భారత సెలెక్టర్లు మొండిచెయ్యి చూపారట. ఆ ముగ్గురు మరెవరో కాదు.. యంగ్ బ్యాటర్ శుబ్​మన్ గిల్, పించ్ హిట్టర్ సూర్యకుమార్ యాదవ్, ఫినిషర్ రింకూ సింగ్ అని క్రికెట్ వర్గాల్లో వినిపిస్తోంది. పాండ్యాతో పాటు ఈ ముగ్గురికీ వరల్డ్ కప్ టీమ్​లో బెర్త్ కష్టమేనని అంటున్నారు. దీనికి ఐపీఎల్ పెర్ఫార్మెన్స్​ ప్రధాన కారణంగా చెబుతున్నారు. క్యాష్ రిచ్ లీగ్ నయా సీజన్​లో దారుణంగా ఫెయిలవడంతో వీళ్లను సెలెక్టర్లతో పాటు బీసీసీఐ పెద్దలు కూడా పట్టించుకోలేదని టాక్ నడుస్తోంది.

ఐపీఎల్-2024లో హార్దిక్ అటు బౌలింగ్​తో పాటు ఇటు బ్యాటింగ్​లోనూ దారుణంగా విఫలమయ్యాడు. అతడు ఇప్పటిదాకా 9 మ్యాచ్​లు ఆడి 197 పరుగులే చేశాడు. బౌలింగ్​లోనూ 4 వికెట్లే పడగొట్టాడు. దీంతో ఆల్​రౌండర్ రోల్ కోసం హార్దిక్​ను తీసుకుందామనుకున్న సెలెక్టర్లు అతడి ప్లేసులో శివమ్ దూబెను ఖాయం చేశారని వినిపిస్తోంది. మిస్టర్ 360 సూర్యకుమార్ కూడా ఈ సారి లీగ్​లో ఫెయిలయ్యాడు. 6 మ్యాచుల్లో 166 రన్సే చేశాడు. దీంతో అతడ్ని పక్కనబెట్టాలని బీసీసీఐ పెద్దలు ఫిక్స్ అయ్యారట. ఈ ఐపీఎల్​లో 320 పరుగులతో మంచి ఫామ్​లో ఉన్న శుబ్​మన్ గిల్ స్ట్రయిక్ రేట్ అంశం సెలెక్టర్లను తీవ్రంగా నిరాశపర్చిందట. 140 స్ట్రయిక్ రేట్​తో ఆడుతుండటంతో అతడి బదులు ఇతర యంగ్​స్టర్స్​ను ఛాన్స్ ఇవ్వాలని డిసైడ్ అయ్యారట. ఇంక 8 మ్యాచుల్లో 112 పరుగులతో ఫినిషర్ రోల్​కు తగిన న్యాయం చేయడంలో రింకూ సింగ్ ఫెయిలయ్యాడు. దీంతో సెలెక్షన్ రాడార్ నుంచి అతడి పేరును కూడా తొలగించారని వినిపిస్తోంది. అయితే వీళ్లు టీమ్​లో ఉంటారా? ఉండరా? అనేది బోర్డు అధికారిక ప్రకటన చేశాకే తెలుస్తోంది.

Show comments