T20 World Cup Rinku Singh And KL Rahul: టీ20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన! ఆ ఇద్దరికి అన్యాయం చేసిన BCCI?

టీ20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన! ఆ ఇద్దరికి అన్యాయం చేసిన BCCI?

టీ20 వరల్డ్ కప్​కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.

టీ20 వరల్డ్ కప్​కు భారత జట్టును ప్రకటించింది బీసీసీఐ. అయితే ఆ ఇద్దరు ప్లేయర్ల విషయంలో అందరి అంచనాలు తలకిందులు అయ్యాయి.

క్రికెట్​కు సంబంధించి ఇప్పుడు అందరూ టీ20 వరల్డ్ కప్ గురించే మాట్లాడుకుంటున్నారు. ఒకవైపు ఐపీఎల్-2024 హడావుడి నడుస్తున్నా.. మెగా టోర్నీ గురించి కూడా జోరుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. దీనికి కారణం వరల్డ్ కప్ స్క్వాడ్స్ అనౌన్స్​మెంట్స్ రావడమే. పొట్టి ప్రపంచ కప్​కు ఇంకా నెల రోజుల టైమ్ మాత్రమే ఉంది. దీంతో అన్ని దేశాలు తమ జట్లను ప్రకటిస్తూ పోతున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో న్యూజిలాండ్​, ఇంగ్లండ్, సౌతాఫ్రికాలు స్క్వాడ్స్​ను ప్రకటించాయి. తాజాగా భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) కూడా వరల్డ్ కప్ టీమ్​ను అనౌన్స్ చేసింది. అయితే ఆ ఇద్దరికి బోర్డు అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ టీమ్​ను బీసీసీఐ ప్రకటించింది. కెప్టెన్ రోహిత్ శర్మ సారథ్యంలోని జట్టును అనౌన్స్ చేసింది. 15 మంది సభ్యుల ఈ టీమ్​ను హిట్​మ్యాన్​ కెప్టెన్​గా ముందుండి లీడ్ చేయనున్నాడు. హార్దిక్ పాండ్యా వైస్ కెప్టెన్​గా వ్యవహరించనున్న ఈ టీమ్​లో ఒకరిద్దరు తప్పితే కొత్తగా ఇన్​క్లూడ్ అయిన వాళ్లు ఎవరూ లేరు. రోహిత్​, హార్దిక్​తో పాటు విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, యశస్వి జైస్వాల్, రిషబ్ పంత్, సంజూ శాంసన్, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, యుజ్వేంద్ర చాహల్, అర్ష్​దీప్ సింగ్, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్​లు టీమ్​లో చోటు దక్కించుకున్నారు. అయితే అనూహ్యంగా ఇద్దరు స్టార్లకు మాత్రం స్క్వాడ్​లో ఛాన్స్ రాలేదు. వాళ్లే రింకూ సింగ్, కేఎల్ రాహుల్. రింకూను రిజర్వ్​డ్​ ప్లేయర్​గా ఎంపిక చేసిన బోర్డు.. రాహుల్​ను మాత్రం సెలెక్షన్​కు పరిగణనలోకి తీసుకోలేదు.

ఈ మధ్య కాలంలో భారత టీ20 జట్టులో రింకూ సింగ్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. సింగిల్ హ్యాండ్​తో టీమిండియాకు చాలా విజయాలు అందించాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఆప్ఘానిస్థాన్​తో జరిగిన టీ20 సిరీస్​ల్లో ఫినిషర్​గా తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు. అలాంటోడ్ని సెలెక్టర్లు మెయిన్ టీమ్​లోకి తీసుకోకుండా.. రిజర్వ్​డ్​ ప్లేయర్​గా ఎంపిక చేశారు. అటు కేఎల్ రాహుల్ కూడా గత కొన్నేళ్లుగా టీమిండియాలో అన్ని ఫార్మాట్లలోనూ కీలక ఆటగాడిగా ఎదిగాడు. బ్యాటింగ్​తో పాటు కీపింగ్ కూడా చేయగల సమర్థుడు. ఈ ఐపీఎల్​లోనూ అతడు మంచి ఫామ్​లో ఉన్నాడు. అయినా అతడ్ని బోర్డు పట్టించుకోలేదు. రిజర్వ్​డ్​ ప్లేయర్​గా కూడా అతడ్ని ఎంపిక చేయలేదు. దీంతో రింకూ, రాహుల్​కు బోర్డు తీవ్ర అన్యాయం చేసిందనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. టీమ్ తరఫున కన్​సిస్టెంట్​గా పెర్ఫార్మ్ చేసినా ఇలా మొండిచెయ్యి చూపడంతో వాళ్ల ఫ్యాన్స్ బీసీసీఐపై విమర్శలకు దిగుతున్నారు. మరి.. రాహుల్, రింకూకు జరిగిన అన్యాయం మీద మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments