T20 World Cup 2024 Squad Unlucky Players: T20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. భారత జట్టులో చోటు దక్కని అన్​లక్కీ స్టార్స్ వీళ్లే!

T20 వరల్డ్ కప్ టీమ్ ప్రకటన.. భారత జట్టులో చోటు దక్కని అన్​లక్కీ స్టార్స్ వీళ్లే!

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే టీమ్​లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. అయితే టీమ్​లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్​ను బీసీసీఐ అనౌన్స్ చేసింది. బోర్డు సెక్రటరీ జై షాతో పాటు చీఫ్​ సెలెక్టర్ అజిత్ అగార్కర్, కెప్టెన్ రోహిత్ శర్మ, కోచ్ రాహుల్ ద్రవిడ్ తదితరులు ఇవాళ ఓ హోటల్​లో సమావేశం అయ్యారు. ఆ తర్వాత 15 మంది సభ్యులతో కూడిన టీమ్​ను ప్రకటించారు. పెద్దగా సంచలనాలకు అవకాశం ఇవ్వకుండా మొదటి నుంచి వినిపిస్తున్న పేర్లనే సెలెక్షన్​లోకి తీసుకున్నారు. ఐపీఎల్-2024లో సెన్సేషనల్ పెర్ఫార్మెన్సెస్​తో దుమ్మురేపిన చాలా మంది స్టార్లను బోర్డు పెద్దలు పట్టించుకోలేదు. టీమ్​లో ప్లేస్ పక్కా అనుకున్న చాలా మంది ఆటగాళ్లకు సెలెక్టర్ల నుంచి మొండిచెయ్యి ఎదురైంది. ఈ నేపథ్యంలో ఆ ప్లేయర్లు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

వరల్డ్ కప్ బెర్త్ మిస్సయిన టీమిండియా స్టార్లు చాలా మంది ఉన్నారు. అందులో 11 మందిని మోస్ట్ అన్​లక్కీ ప్లేయర్స్​గా చెప్పాలి. ఎందుకంటే ఐపీఎల్​లో రఫ్ఫాడించినా, తమ పెర్ఫార్మెన్స్​తో అందర్నీ ఆకట్టుకున్నా వాళ్లకు విండీస్​కు వెళ్లే ఛాన్స్ దక్కలేదు. ఈ అన్​లక్కీ ప్లేయర్లతో ఓ జట్టును తయారు చేయొచ్చు. ఈ మధ్య టీమిండియా ఆడే టీ20 సిరీస్​ల్లో రెగ్యులర్​ ప్లేయర్​గా ఉన్న డాషింగ్ ఓపెనర్ రుతురాజ్ గైక్వాడ్​కు పొట్టి కప్పులో పాల్గొనే ఛాన్స్ రాలేదు. ఐపీఎల్​లో బ్యాట్​తో దుమ్మురేపినా అతడ్ని సెలెక్టర్లు పరిగణనలోకి తీసుకోలేదు. ఎస్​ఆర్​హెచ్​కు ఫైరింగ్ స్టార్ట్స్ ఇస్తూ, విధ్వంసక ఇన్నింగ్స్​లతో విరుచుకుపడుతున్న అభిషేక్ శర్మనూ బోర్డు పెద్దలు విస్మరించారు. మూడు ఫార్మాట్లలోనూ భారత జట్టులో కీలకంగా మారిన శుబ్​మన్ గిల్​కు వరల్డ్ కప్ మెయిన్ టీమ్​లో చోటు దక్కలేదు.

రిజర్వ్​డ్ ప్లేయర్స్​లో ఒకడిగా ప్రపంచ కప్​కు వెళ్లనున్నాడు గిల్. ఐపీఎల్​లో మెరుపులు మెరిపిస్తున్న తిలక్ వర్మకూ మొండిచెయ్యే ఎదురైంది. తెలుగోడిని బీసీసీఐ రిజర్వ్​డ్ ప్లేయర్​గా కూడా తీసుకోలేదు. వీళ్లే కాదు.. సీనియర్ ఆటగాడు కేఎల్ రాహుల్​నూ బోర్డు విస్మరించింది. అతడికి బదులు సంజూ శాంసన్​ను టీమ్​లోకి తీసుకుంది. పించ్ హిట్టర్ రింకూ సింగ్​కు మెయిన్ టీమ్​లో చోటు దక్కలేదు. ఆఖర్లో వస్తూ మ్యాచ్​లు ఫినిష్ చేసే రింకూకు అన్యాయం జరిగింది. ఈ ఐపీఎల్​లో ధనాధన్ ఇన్నింగ్స్​లతో మ్యాజిక్ చేస్తున్న దినేష్ కార్తీక్, బౌలింగ్​లో అదరగొడుతున్న నటరాజన్, సందీప్ శర్మ, ముకేశ్ కుమార్, రవి బిష్ణోయ్​ను కూడా సెలెక్టర్లు పక్కనబెట్టడం గమనార్హం.

Show comments