OTT లోకి షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్!

OTT లోకి షారుక్ తనయుడు ఆర్యన్ ఖాన్ వెబ్ సిరీస్!

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన బడా హీరోలు.. ఇప్పుడు వారి వారి వారసులను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు.. ఓ వెబ్ సిరీస్ ద్వారా పరిచయం అవ్వబోతున్నాడు. కానీ హీరో గా కాదు. ఓ దర్శకుడిగా . ఆ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చూసేద్దాం.

ఒకప్పుడు ఇండస్ట్రీని ఏలిన బడా హీరోలు.. ఇప్పుడు వారి వారి వారసులను కూడా రంగంలోకి దింపుతున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ స్టార్ హీరో కొడుకు.. ఓ వెబ్ సిరీస్ ద్వారా పరిచయం అవ్వబోతున్నాడు. కానీ హీరో గా కాదు. ఓ దర్శకుడిగా . ఆ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ లోకి రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆ విషయాలు చూసేద్దాం.

ఓటీటీ ప్లాట్ ఫార్మ్స్ కు ఈ మధ్య కాలంలో బాగా క్రేజ్ పెరుగుతున్న క్రమంలో.. వెండి తెరపైన అలరించిన ఎంతో మంది హీరోలు, హీరోయిన్లు అందరు కూడా.. ఇప్పుడు ఓటీటీ బాట పడుతున్నారు. అలాగే అనుకున్న విధంగానే ఆయా సినిమాలు ఓటీటీ లో సక్సెస్ కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటివరకు ఎంతో మంది అగ్ర హీరోలు, హీరోయిన్స్ ఓటీటీ లో సినిమాలు చేసేందుకు ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు ఇండస్ట్రీని ఏలుతున్న బడా హీరోలు.. వారి వారి వారసులను ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నారు. ప్రస్తుతం ఓ స్టార్ హీరో తనయుడు.. వెబ్ సిరీస్ ద్వారా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు, అయితే హీరోగా మాత్రం కాదు. ఓ దర్శకుడిగా.. మరి ఆ యువ దర్శకుడు ఎవరో.. ఆ వెబ్ సిరీస్ ఏంటో.. దానికి సంబంధించిన విశేషాలను చూసేద్దాం.

సాధారణంగా హీరోల కొడుకులంటే.. వారు కూడా హీరోలుగానే ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వాలి అనేది.. పాత సామెత కానీ.. ఇప్పుడున్న జెనెరేషన్ అంతా కూడా కాస్త డిఫ్ఫరెంట్ గా ఆలోచిస్తూ.. హీరోలుగా కాకుండా దర్శకులుగా ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పుడు పరిచయం అవుతున్న యంగ్ డైరెక్టర్ మరెవరో కాదు, బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తనయుడు.. ఆర్యన్ ఖాన్. ఆర్యన్ ఖాన్ డైరెక్షన్ చేస్తున్న ఓ వెబ్ సిరీస్ ఓ సంవత్సరంగా షూటింగ్ జరుపుకుంటుంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ షూటింగ్ ఆఖరి దశకు చేరుకుందని సమాచారం. ఇక ఈ ఏడాది చివరిలోనే ఈ వెబ్ సిరీస్ ఓటీటీ లో స్ట్రీమింగ్ కు రెడీ అయిపోతుందనే ప్రచారం జరుగుతుంది. ఆ వెబ్ సిరీస్ పేరు “స్టార్ డమ్”. ఈ వెబ్ సిరీస్ ఏ ప్లాట్ ఫార్మ్ లో స్ట్రీమింగ్ అవుతుందనేది ఇంకా ఫిక్స్ అవ్వలేదు కానీ.. షూటింగ్ కనుక పూర్తయితే ఈ ఏడాది చివరిలోనే ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది.

ఇక ఈ వెబ్ సిరీస్ ను మొత్తం ఆరు ఎపిసోడ్స్ గా చిత్రీకరిస్తున్నారు. ఇందులో ఎవరెవరు నటిస్తున్నారన్న విషయం ఇంకా బయటకు రాయలేదు కానీ.. ఇప్పటివరకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం.. షారుఖ్ ఖాన్, రణబీర్ కపూర్, రణవీర్ సింగ్, బాబీ డియోల్ లాంటి వారు ప్రముఖ పాత్రలో నటించనున్నారని సమాచారం. ‘రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్‌మెంట్‌’ పతాకంపై షారూఖ్‌ సతీమణి.. స్టార్ డమ్ వెబ్ సిరీస్ కు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇక ఈ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా..బయటకు రావాల్సి ఉంది. మరి షారుక్ తనయుడు దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్న ఈ సిరీస్ పై.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments