మొటిమల కోసం సాయి పల్లవి సర్జరీ చేయించుకుందా? హీరోయిన్ సంచలన కామెంట్స్

Sai Pallavi: మొటిమల కోసం సాయి పల్లవి సర్జరీ చేయించుకుందా? హీరోయిన్ సంచలన కామెంట్స్

సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే. ఈమెను చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత న్యాచురల్ బ్యూటీ ఈమెకు మాత్రమే సొంతం. అయితే తాజాగా సాయి పల్లవి తన అందం కోసం చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి గురించి అందరికి తెలిసిందే. ఈమెను చూస్తే ఎవరైనా సరే ఫిదా అయిపోవాల్సిందే. అంత న్యాచురల్ బ్యూటీ ఈమెకు మాత్రమే సొంతం. అయితే తాజాగా సాయి పల్లవి తన అందం కోసం చేసిన కొన్ని వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సాయి పల్లవి సహజ సిద్దమైన అందానికి పెట్టింది పేరు. ప్రేమమ్ సినిమాతో తెలుగులో ప్రేక్షకులకు పరిచయం అయ్యి.. ఫిదా సినిమాతో అందరిని ఫిదా చేసేసింది సాయి పల్లవి. ఇప్పుడున్న హీరోయిన్స్ అంతా ఓ ఎత్తైతే.. సాయి పల్లవి వారందరికంటే కూడా డిఫరెంట్ అని చెప్పి తీరాలి.. అటు తెరపైన ఎంత హుందాగా పద్దతిగా అయితే కనిపిస్తుందో తెర వెనుక కూడా అలానే ఉంటుంది ఈ అమ్మడు. సోషల్ మీడియాలో నిత్యం కనిపించకపోయినా.. అప్పుడప్పుడు దర్శనం ఇచ్చినా కూడా ఆమె ఫోటోలు క్షణాల్లో వైరల్ అయిపోతూ ఉంటాయి. సాయి పల్లవిని లేడీ పవర్ స్టార్ అని కూడా అంటూ ఉంటారన్న సంగతి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే తాజాగా ఈ అమ్మడు తన అందం గురించి మాట్లాడుతూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సాయి పల్లవికి తన అందం గురించి కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. అదేంటంటే.. ప్రేమమ్ సినిమా చేసిన సమయంలో సాయి పల్లవి ముఖం మీద చాలా మొటిమలు ఉండేవి. ఓ రకంగా తనకు ఆ సినిమా ఆఫర్ రాడానికి కూడా అవే కారణం అని కూడా చాలా సార్లు చాలా ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది ఈ అమ్మడు. దాదాపు ఆ తర్వాత తీసిన సినిమాలలోనూ సాయి పల్లవి ముఖం మీద మొటిమలు కనిపిస్తూనే ఉండేవి. ఎటువంటి మేకప్ లేకుండా ఆమె సినిమాలలో కనిపిస్తుంది. అయితే, ఈ మధ్య కాలంలో మాత్రం ఆమె ముఖంపై మొటిమలు కనిపించడం లేదు. సో దానికోసం ఏమైనా ట్రీట్మెంట్ చేయించుకున్నారు అని అడుగగా.. దానికోసం ఏమి చేయించుకోలేదని చెప్పుకోచిందని ఈ అమ్మడు. టీనేజ్ అమ్మాయిలకు మొటిమలు సహజమే అని.. ఒక ఏజ్ వచ్చిన తర్వాత వాటంతట ఏవ్ పోతాయంటూ చెప్పుకొచ్చింది ఈ బ్యూటీ..

అలాగే తన ఒత్తయిన కురుల గురించి చెబుతూ తానూ ఆర్గానిక్ ఆహారపదార్ధాలను తింటాననని.. అలోవెరా జెల్ ఉపయోగిస్తానని చెప్పుకొచ్చింది. దీనితో ఈ విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోతున్నాయి. ఇక దీనిని చూసిన నెటిజన్లు ఇందుకు కదా ఆమెను న్యాచురల్ బ్యూటీ అనేది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నిజమే కదా మరీ. ఇక ఆమె సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సాయి పల్లవి తెలుగులో నాగ చైతన్యతో కలిసి “తండేల్ సినిమాలో నటిస్తుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదల చేసిన గ్లిమ్ప్స్ అందరిని ఎంతో ఆకట్టుకుంది. ఇక తమిళంలోనూ ఓ సినిమా చేస్తుంది. వాటితో పాటు హిందీలో రామాయణం పేరుతో తెరకెక్కుతున్న సినిమాలో సీతగా నటిస్తుంది ఈ అమ్మడు. తాజాగా ఆ సెట్స్ నుంచి వచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. సో ప్రస్తుతం ఈ బ్యూటీ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా ఉంది. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments