సిద్ధిపేటలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఇల్లు దగ్ధం

సిద్ధిపేటలో పేలిన ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీ.. ఇల్లు దగ్ధం

ఇటీవల కాలంలో ఎలక్ట్రిక్ బైక్ బ్యాటరీలు, వాహనాల పేలుళ్ల ఘటనలు వరుసగా చోటుచేసుకుంటున్నాయి. కొన్ని ఘటనల్లో ప్రాణనష్టం లేకపోయినా.. మరికొన్ని ఘటనల్లో వ్యక్తులు ప్రాణాలు కోల్పోయారు. ఈ పేలుడు ఘటనలు ఎలక్ట్రిక్ బైక్ లను కొనుగోలు చేయాలనుకునే వాహనదారుల్లో వణుకు పుట్టిస్తున్నాయి. తాజాగా తెలంగాణలోని సిద్ధిపేట జిల్లాలో చార్జింగ్ పెట్టి ఉన్న ఓ ఎలక్ట్రిక్ వాహనంలో బ్యాటరీ అమాంతం పేలిపోయింది.

బ్యాటరీ పేలుడు ఘటనలో ప్రాణనష్టం లేకపోయినా.. ఓ ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. దుబ్బాక మండలం పెద్దచీకోడు గ్రామంలో పుట్ట లక్ష్మీనారాయణ అనే వ్యక్తి మంగళవారం రాత్రి తన ఎలక్ట్రిక్ వాహన బ్యాటరీకి ఇంటిముందు చార్జింగ్ పెట్టాడు. చార్జింగ్ ఉండగానే బ్యాటరీ పేలడంతో.. పెద్దఎత్తున మంటలు చెలరేగి.. ఇంటికి అంటుకున్నాయి. ఈ ఘటనలో లక్ష్మీనారాయణ ఇల్లు పూర్తిగా కాలి దగ్ధమైంది.

Show comments