Chaitra Navaratri: ఈ ఏప్రిల్ నెలలో 9 రోజులు.. భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదంట!

ఈ ఏప్రిల్ నెలలో 9 రోజులు.. భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదంట!

chaitra navaratri: హిందుమతం ప్రకారం.. పండగల వేళ అనేక నియమ నిబంధనలు ఉంటాయి. అలాంటి వాటిల్లో భార్యాభర్తల కలయికా కూడా ఓ నిబంధనగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయంలో దంపతులు కలవకూడనది పండితులు చెబుతుంటారు. అలానే ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదంట.

chaitra navaratri: హిందుమతం ప్రకారం.. పండగల వేళ అనేక నియమ నిబంధనలు ఉంటాయి. అలాంటి వాటిల్లో భార్యాభర్తల కలయికా కూడా ఓ నిబంధనగా ఉంటుంది. కొన్ని ప్రత్యేక సమయంలో దంపతులు కలవకూడనది పండితులు చెబుతుంటారు. అలానే ఏప్రిల్ నెలలో 9 రోజుల పాటు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదంట.

భార్యాభర్తల బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అలానే వారి బంధం బలపడటంతో శారీరక కలయిక అనేది కూడా కీలక పాత్ర పోషిస్తుందనే విషయం తెలిసిందే. అందుకే దంపతుల బంధం గట్టిగా ఉండేందుకు ఆరోగ్యకమైన శారీరక కలయిక మంచిందని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని కొన్ని సందర్భాల్లో భార్యాభర్తలు కలవరనే విషయం మనకు తెలిసిందే. తాజాగా ఏప్రిల్ నెలలో ఆ రోజులు భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదంట. మరి.. ఆ తొమ్మిది రోజులు ఏమిటి, ఎందుకు కలవకూడదు?. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం..

హిందూపురాణాల్లో నవరాత్రులు అనేవి ఎంతో ముఖ్యమైనవి.  ఏడాదికి నాలుగు సార్లు ఈ  నవరాత్రుల పండగ వస్తుంది. అందులో శారదీయ నవరాత్రులు, చైత్ర నవరాత్రులు అనేవి  ఎంతో ప్రాముఖ్యత కలిగినవి అని పండితులు చెబుతున్నారు. ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడ చైత్ర నవరాత్రులు ఈ ఏప్రిల్ నెలలో రానుంది. ఈ చైత్ర నవరాత్రులు ఏప్రిల్ 9వ తేదీ నుంచి ప్రారంభమం కానుంది. అలా మొదలై.. ఏప్రిల్ 17వ తేదీ తో ముగియనుంది. ఈ నేపథ్యంలో అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజిస్తారు.

ఈ చైత్ర నవరాత్రులైన 9 రోజుల పాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలకరించి.. పూజలు నిర్వహిస్తుంటారు. చైత్ర నవరాత్రులు దుర్గాదేవి రాక్షసుడు మహిషాసురుడితో యుద్ధం చేసి, అతనిపై సాధించిన విజయానికి సూచికగా ఈ నవరాత్రులు వేడుక జరుపుతుంటారని పండితులు చెబుతుంటారు. ఈ తొమ్మిది రోజుల పాటు భక్తులు దుర్గమ్మను పూజిస్తూ, ఆమె శక్తిని, ధైర్యాన్ని కీర్తిస్తుంటారు. ఇక ఈ  చైత్ర నవరాత్రుల సమయంలో భక్తులు ఉపవాసం కూడా ఉంటారు. అలానే ఈ సమయంలో దంపతలు శారీరక సంబంధం పెట్టుకోకూడదు.

నవరాత్రుల పండుగకు ఆధ్యాత్మికంగా ఎంతో ప్రాముఖ్యత ఉంది. అందుకే ఈ 9 రోజులు అమ్మవారి సేవలో లీనమవ్వాలని పండితులు చెబుతుంటారు. అదే విధంగా భార్యాభర్తలు ఈ సమయంలో సెక్సువల్ యాక్టివిటీ, ముద్దులు వంటివి వాటికి దూరంగా ఉంటారు. ఈ నవరాత్రుల సమయంలో భక్తులు తమ ఆలోచనలను ఆధ్యాత్మిక భావన వైపు మళ్లిస్తారు. ఈక్రమంలోనే శారీరక సంబంధం ఆధ్యాత్మిక  భావనకు భంగం కలిగిస్తుంది. అందుకే ఈ 9 రోజులు పాటు పొరపాటున కూడా శారీరకంగా కలిసేందుకు భార్యాభర్తలు అవకాశం ఇవ్వరు. అలానే ఎవరైనా పొరపాటున ఇలాంటి ఆలోచన వచ్చిన దూరంగా ఉండాలని పలువురు చెబుతున్నారు.

నవరాత్రులు ఒక శక్తివంతమైన సమయం కాబట్టి భక్తులు ఆధ్యాత్మిక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు. ఈ 9 రోజులు భక్తులు మనసును స్థిరంగా ఉంచుకోవడానికి ప్రయత్నిస్తారు. దీంతో తమకు ఎంతో పుణ్య ఫలం వస్తుందని భక్తులు బలంగా నమ్ముతారు. కాబట్టి ఏప్రిల్ లో వచ్చే ఈ చైత్ర నవరాత్రులలో భార్యాభర్తలు శారీరకంగా కలవకూడదని తెలుస్తోంది. ఈ సమాచారం అంతా అంతర్జాల నుంచి సేకరించడం జరిగింది.

Show comments