చరిత్ర తిరగరాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యలో ఏపీకి టాప్ గ్రేడ్!

చరిత్ర తిరగరాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యలో ఏపీకి టాప్ గ్రేడ్!

  • Author singhj Updated - 12:10 PM, Mon - 14 August 23
  • Author singhj Updated - 12:10 PM, Mon - 14 August 23
చరిత్ర తిరగరాసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్.. విద్యలో ఏపీకి టాప్ గ్రేడ్!

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్​మోహన్ రెడ్డి చరిత్ర తిరగరాశారు. పాఠశాల విద్యపై స్పెషల్ ఫోకస్ చేసిన ఆయన.. ఈ విషయంలో ఫుల్ సక్సెస్ అయ్యారు. విద్యాబోధన, సంస్కరణల్లో దేశం మొత్తం మీద చూసుకుంటే ఏపీ విధానాలు అత్యుత్తమంగా ఉన్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కేంద్ర విద్యాశాఖ పెర్ఫార్మెన్స్ గ్రేడింగ్ ఇండెక్స్ (పీజీఐ) రిలీజ్ చేసిన అత్యుత్తమ కేటగిరీలో.. దేశంలో ఆంధ్రప్రదేశ్​ టాప్ ప్లేస్​లో నిలిచింది. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ ఏపీకి అభినందనలు కూడా తెలిపింది. చదువుకు పెట్టిన పెట్టుబడికి సమీప భవిష్యత్తులో అద్భుతమైన ఫలితాలు రానున్నట్లు చెప్పుకొచ్చింది.

అక్షరాస్యతలో అద్భుతంగా ఉంటే అభివృద్ధి సునాయాసమని ఈ సందర్భంగా పీజీఐ పేర్కొంది. పాఠశాల విద్యలో దేశంలోనే ఏపీ అగ్రగామిగా నిలవడంపై రాష్ట్ర విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్​ ప్రకాశ్ హర్షం వ్యక్తం చేశారు. ఏపీలో ఎడ్యుకేషన్ విషయంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చినట్లు తెలిపారు. కేవలం విద్యకు సంబంధించే 10 సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని చెప్పారు. పిల్లల చదువుల విషయంలో తల్లిదండ్రులకు అన్ని విధాలుగా సీఎం జగన్​మోహన్ రెడ్డి సర్కారు అండగా ఉంటోందన్నారు. అమ్మఒడి, విద్యాకానుక, నాడు-నేడు లాంటి స్కీమ్స్​తో స్టూడెంట్స్​కు ప్రభుత్వం దన్నుగా నిలుస్తోందన్నారు.

ఇక, భారత్​లోని ఏ రాష్ట్రంలోనూ లేనివిధంగా జగనన్న అమ్మఒడి, విద్యాకానుక, జగనన్న గోరుముద్ద, నాడు-నేడు కోసం ఏపీ సర్కారు ఏకంగా రూ.66,722 కోట్లు ఖర్చు చేస్తోంది. ఒక్క జగనన్న అమ్మఒడి స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి ఏడాదికి ప్రభుత్వం రూ.15 వేలు అందిస్తోంది. ఈ పథకం ద్వారా పేదరికం విద్యకు అడ్డంకిగా మారకుండా, విద్యార్థుల హాజరు శాతం తగ్గకుండా సర్కారు చూస్తోంది. అలాగే మన బడి నాడు-నేడు ప్రోగ్రామ్ కింద రాష్ట్రవ్యాప్తంగా 15,715 పాఠశాలల్లో అదనపు తరగతి గదులు, సురక్షిత తాగునీరు, మరమ్మత్తుల పనులు, మరుగుదొడ్ల నిర్వహణ, పెయింటింగ్, ఫర్నీచర్, గ్రీన్ బోర్డులు, విద్యుదీకరణ లాంటి మౌలిక సదుపాయాలను ఆధునీకరిస్తోంది సీఎం జగన్ ప్రభుత్వం.

Show comments