మధ్యాహ్నం
వేళలో కునుకు తీస్తున్నారా? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోవాల్సిందే
మనిషికి అన్నపానియాలు ఎంత ముఖ్యమో నిద్ర కూడా అంతే ముఖ్యం.
సరైన నిద్ర లేకపోతే అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.
రోజుకు 8 గంటలు నిద్ర పోవాలని వైద్యులు సూచిస్తుంటారు.
కానీ నేటి ఉరుకుల పరుగుల జీవితంలో నిద్రకు కేటాయించే సమయం తగ్గిపోతుంది.
అయితే కొంతమంది మధ్యాహ్న వేళలో నిద్రిస్తుంటారు.
మధ్యాహ్న సమయంలో తీసే కునుకు ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు.
15 నుండి 20 నిమిషాలు నిద్రపోవడం శరీరానికి , మనస్సుకు మంచిదని అధ్యయనాలు చెబుతున్నాయి.
జ్ఞాపకశక్తి ,మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఈ నిద్ర సహాయపడుతుంది.
మధ్యాహ్నం నిద్రించడం వల్ల మెదడు చురుగ్గా పనిచేయడానికి ఉపయోగపడుతుంది.
మధ్యాహ్నం నిద్ర, థైరాయిడ్ సమస్యల నుంచి బయటపడొచ్చునని నిపుణలు చెబుతున్నారు.
మధ్యాహ్నం నిద్ర గుండె సంబంధిత సమస్యలు రాకుండా కాపాడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మధ్యాహ్నం నిద్ర చిన్నారులకు, పెద్దలకు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం