ఈ రోజుల్లో చాలామంది డయాబెటిస్ సమస్యతో భాదపడుతున్నారు.
దీనితో ఎప్పటికప్పుడు షుగర్ ని అదుపులో ఉంచుకోవాల్సి వస్తుంది.
అయితే, షుగర్ అదుపులో ఉంచడంలో మామిడి ఆకులు బాగా ఉపయోగపడతాయి.
మామిడి ఆకుల్లో ఉండే పోషకాలు శరీరంలో ఉన్న షుగర్ ను తగ్గిస్తాయి.
దానికోసం 15 మామిడి ఆకులను తీసుకొని బాగా కడిగి 150 ఎంఎల్ నీటిలో వేసి బాగా మరిగించాలి.
ఆ తర్వాత ఆ కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచి.. తరువాత రోజు ఉదయం పరగడుపునే తాగాలి.
ఇలా ప్రతి రోజు చేయడం వలన మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు లభిస్తాయి.
ఈ కాషాయం వలన శరీరంలో ఇన్సులిన్ ఉత్పత్తి పెరుగుతుంది.
మామిడి ఆకుల్లో పెక్టిన్, ఫైబర్, విటమిన్ సి ఉంటాయి.
అందుకే షుగర్ లెవల్స్ తగ్గడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు కూడా తగ్గుతాయి.
మామిడి ఆకులతో ఈ విధంగా చేయడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు.
మామిడి ఆకులు డయాబెటిస్ కు చాలా మంచిది అని ఒక పరిశోధనలో కూడా తేలింది.