హీరోగా పల్లవి ప్రశాంత్?
పల్లవి ప్రశాంత్.
. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఓ సెన్సేషన్.
ఎలాంటి అంచనాలు లేకుండా
బిగ్ బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇచ్చి.. ఏకంగా టైటిల్ నే ఎగరేసుకుపోయాడు ఈ రైతు బిడ్డ.
పల్లవి ప్రశాంత్ ను అమర్ దీప్ టార్గెట్ చేశాక.. అతడిపై జనాల్లో సింపథీ పెరిగింది.
అదే అతడిని టైటిల్ కు దగ్గర చేసింది.
ఇక బిగ్ బాస్ విన్నర్ గా బయటకి వచ్చిన తర్వాత ఫ్యాన్స్ చేసిన పనికి,
అతడి స్వయంకృపరాధానికి ప్రశాంత్ జైలుపాలైయ్యాడు.
ఇటీవలే బెయిల్ పై విడుదల అయ్యాడు ప్రశాంత్.
ఈ నేపథ్యంలో ఓ హాట్ న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది.
త్వరలోనే పల్లవి ప్రశాంత్ హీరోగా వెండితెరకు ఎంట్రీ ఇస్తున్నాడట.
ఈ విషయాన్ని తన సహచర కంటెస్టెంట్ భోలే షావలి తెలిపాడు.
బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడే పల్లవి ప్రశాంత్ కు
సినిమా ఆఫర్స్ వచ్చాయని భోలే తెలిపాడు.
రైతు బిడ్డ హీరోగా, పాట బిడ్డ మ్యూజిక్ డైరెక్టర్ గా సినిమా చేయమని
నిర్మాతలు అడుగుతున్నారని భోలే వివరించాడు.
అతడికి ఓకే అయితే త్వరలోనే వెండితెరపై కనిపిస్తాడన్న షాకింగ్
విషయాలను వెల్లడించాడు భోలే.
కాగా.. ఈ న్యూస్ తెలిసి
పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ సంతోషపడుతున్నారు