ఇంకో 14 ఏళ్లలో భూమికి ముప్పు పొంచి ఉందని నాసా హెచ్చరించింది.
భూమికి దగ్గరలో ఉన్న ప్రమాదకర గ్రహశకలం వల్ల ముప్పు ఉందని నాసా గుర్తించింది.
ఇటీవల జరిపిన ఓ హైపోథెటికల్ ప్రోగ్రాంలో భాగంగా గ్రహశకలం భూమిని ఢీకొడితే ఏంటి పరిస్థితి అనే అంశంపై వందల మంది బృందంతో కలిసి ఒక ఎక్సర్ సైజ్ ని నిర్వహించింది.
ఈ ప్రమాదాన్ని ఎలా అంచనా వేయాలి? ఈ ముప్పుని ఎదుర్కునే టెక్నాలజీ గానీ సామర్థ్యం గానీ మనకి ఉందా? అసలు ప్రమాదం ఏ స్థాయిలో ఉండబోతుంది? వంటి విషయాలపై ఒక చర్చని కొనసాగించింది.
మరో 14 ఏళ్లలో అంటే 2038 జూన్ నెలలో గ్రహశకలం భూమిని ఢీకొట్టే అవకాశం 72 శాతం ఉందని నాసా తెలిపింది.
అయితే దీన్ని ఎదుర్కునే టెక్నాలజీ గానీ, సామర్థ్యం గానీ ప్రస్తుతం అయితే తమ వద్ద లేదని.. ఇదే ప్రధాన సమస్య అని నాసా ఆందోళన వ్యక్తం చేసింది.
గ్రహశకలం భూమిని ఢీ కొడితే ఆ ప్రభావం ఏ రేంజ్ లో ఉంటుందో అనే దానిపై కూడా స్పష్టత లేదని నాసా వెల్లడించింది.
అయితే ఈ ముప్పును ఎదుర్కొనేందుకు తాము ఒక టెక్నాలజీని డెవలప్ చేస్తున్నామని నాసా తెలిపింది.
ఈ టెక్నాలజీ ద్వారా గ్రహశకలాలతో భూమికి పొంచి ఉన్న ముప్పుని నివారించవచ్చునని తెలిపింది.