విడాకులకు కారణాలు చెప్పిన
వంశీకృష్ణారెడ్డి
ఈమధ్య కాలంలో ట్రెండింగ్లో నిలిచిన జంట వంశీకృష్ణ-నేత్రా రెడ్డి.
వంశీకృష్ణరెడ్డి మోటివేషనల్ స్పీకర్గా జనాలకు పరిచయం.
సేంద్రీయ వ్యవసాయం చేసే మహిళగా నేత్రా రెడ్డి గుర్తింపు పొందింది.
ప్రేమించి.. పెద్దలను ఎదిరించి మరీ వివాహం చేసుకున్నారు.
వీరిద్దరూ కలిసి సేంద్రీయ వ్యవసాయం, ఉత్పత్తుల గురించి వీడియోలు చేస్తూండేవారు.
ఇప్పుడు వీరిద్దరూ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు.
ఐడ్రీమ్ మీడియా ఇంటర్వ్యూలో వంశీకృష్ణ విడాకులకు కారణాలు వివరించాడు.
విడాకుల గురించి ఒపెన్గా మాట్లాడకూడదని అనుకున్నాం అన్నాడు.
అందుకే విడాకులకు గల కారణాల గురించి చెప్పలేను అన్నాడు.
కానీ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా కొన్ని విభేదాలు వచ్చాయన్నాడు.
కలిసి ఉన్నప్పుడు తాము సంతోషంగా లేమన్నాడు.
ఎంత అడ్జస్ట్ అయినా పరిస్థితులు మారలేదని తెలిపాడు
ఏదో అసంతృప్తి. అందుకే విడిపోయాము అన్నాడు.
కలిసి ఉన్న రోజుల్లో విడిపోతామనే ఆలోచన లేదన్నాడు.
తమ మధ్య పెద్దగా గొడవలు కూడా జరిగేవి కావన్నాడు.
తమ బంధానికి దిష్టి తగిలిందన్నాడు.
పరిస్థితి పూర్తిగా చేయి జారిపోవడం వల్లే విడాకులు తీసుకున్నాం అన్నాడు.