నానబెట్టిన వేరు శనగలు తింటున్నారా?.. అయితే ఈ విషయాలు తెలుసుకోవాల్సిందే?

నానబెట్టిన వేరు శనగలు తింటే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయంటున్నారు ఆరోగ్య నిపుణులు.

వేరుశనగలను నానబెట్టుకొని తినడం వలన పోషక విలువలు మెరుగుపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

వేరుశనగలో గుడ్లు, మాంసం కంటే ప్రోటీన్ శాతం ఎక్కువ. ఇది పిల్లలకు, పెద్దలకు, పాలిచ్చే తల్లులకు మంచిది.

వేరుశనగలో శరీరానికి మేలు చేసే లిపిడ్లు, ఫాస్పరస్, ప్రొటీన్లు, విటమిన్లు, ఫైబర్, పొటాషియం అధికంగా ఉంటాయి.

నానబెట్టిన వేరుశనగ కండరాలను టోన్ చేయడంలో సహాయపడుతుంది, కండరాల క్షీణతను నివారిస్తుంది.

నానబెట్టిన వేరుశనగలను ఉదయం ఖాళీ కడుపుతో తినడం వల్ల గ్యాస్, ఆసిడిటీ తగ్గుతుంది.

నానబెట్టిన వేరుశనగలు తినడం వలన రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది, గుండె జబ్బులను దూరం చేస్తుంది.

వేరుశనగలో ఐరన్, ఫోలేట్, కాల్షియం , జింక్ ఉంటాయి. ఇవన్నీ క్యాన్సర్ కణాల అభివృద్ధిని అడ్డుకుంటాయి.

నానబెట్టిన వేరుశనగలను క్రమం తప్పకుండా తినడం వల్ల మీ చర్మానికి అద్భుతమైన మెరుపు వస్తుంది.

ఉదయాన్నే నానబెట్టిన వేరుశనగను తినడం వల్ల పిల్లలు, పెద్దలలో జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది.

వేరుశనగలను వేయించి బెల్లం కలిపి తీసుకుంటే రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.