శరీరంలో పేరుకున్న కొవ్వు పోవాలంటే.. ఇవి ఫాలో అయితే చాలు!
పరగడుపున ఈ ఆహార పదార్ధాలు తింటే ప్రాణాలకే ప్రమాదం.. అవేంటో తెలుసా !
శరీరంలో పేరుకున్న కొవ్వు కారణంగా పలు అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
ఎక్కువ ఆహారం తీసుకుని తక్కువ శారీరక శ్రమ చేయడంతో ఈ కొవ్వు ఏర్పడుతుంది.
ఈ అధిక కొవ్వు కారణంగా రక్తనాళాలు బ్లాక్ అయ్యీ.. గుండె పోటు వచ్చే అవకాశం ఉంటుంది.
అలానే అధిక కొవ్వు కారణంగా జీర్ణక్రియ సంబంధమైన అనేక సమస్యలు వస్తాయి.
శరీరంలో పేరుకుపోయిన కొవ్వును తొలగించాలంటే కొన్ని ఆహార పద్దతుల పాటిస్తే చాలు
మనం తినే ఆహారంలో ఎప్పుడూ ఒకే రకం నూనెను వినియోగించ కూడదు
రెండు రకాల నూనెలు కలిపి ఆహారంలో ఉపయోగిస్తే.. అధిక కొవ్వుకు చెక్ పెటొచ్చు
అలానే ఆయిల్ ఫుడ్ కంటే.. కూరగాయలు, పండ్లు ఎక్కువగా తీసుకుంటే మంచిది
కూరగాయలు, పండ్ల వలన శరీరానికి శక్తి తో పాటు కొవ్వును అదుపులో ఉంచుతుంది
బయట వండిన ఆహార పదార్థలను వీలైనంత వరకు తగ్గిస్తే..కొవ్వు కంట్రోల్ లో ఉంటుంది
రోజూ మూడు పచ్చి వెల్లుల్లి రేకులు, ఉల్లిపాయలు తినడం మంచిది
ఆరోగ్యం కోసం అంటూ తీసుకునే జీడిపప్పు, వేరుశనగ వంటివి మితంగా తీసుకోవాలి
అధిక కొవ్వును తగ్గించుకునేందుకు జంక్ ఫుడ్ జోలికి అసలు వెళ్లకూడదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం