1528లో బాబర్ అయోధ్యలో మసీదు కట్టించాడు. అతని పేరు మీదుగానే బాబర్ మసీదు (బాబ్రీ మసీదు) అని పేరు వచ్చింది.
అయితే అయోధ్యలో ఎప్పటి నుంచో రామ మందిరం ఉందని.. బాబర్ రామ మందిరాన్ని కూల్చి మసీదు కట్టించాడని హిందువుల వాదన.
దీంతో 2010లో అలహాబాద్ హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. ఆ 2.77 ఎకరాల స్థలం ముగ్గురికీ సమానంగా చెందుతుందని.. ముగ్గురూ సమానంగా పంచుకోండని చెప్పింది.
ఈ తీర్పు ఇటు హిందూ సంస్థలకు, అటు సున్నీ వక్ఫ్ బోర్డుకి, నిర్మోహి అఖారా సంస్థకు నచ్చలేదు. సుప్రీంకోర్టులో కేసు వేశారు.
ల్యాండ్ మీకే చెందుతుందని ఎవరు నిరూపించుకుంటే ఆ స్థలాన్ని వారికే ఇస్తామని సుప్రీంకోర్టు చెప్పింది.
ల్యాండ్ గురించి వాస్తవాలు తెలియడానికి ‘ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) ’ని నియమించింది.
ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టుకి తన వాదనలు వినిపించింది.
మసీదు కింద 10వ శతాబ్దానికి చెందిన ఆలయం ఉన్నట్టు ఆధారం ఉందని అయితే దాన్ని కూల్చి మసీదు కట్టారనడానికి ఆధారాలు లేవని తెలిపింది.
అయితే స్థలం లోపల కాంపౌండ్ లో ఎప్పటి నుంచో హిందువులు ప్రార్థన చేసుకుంటున్నట్లు సాక్ష్యం ఉందని ఏఎస్ఐ వెల్లడించింది.
అలానే మసీదులో ముస్లింలు ఎప్పటి నుంచో ప్రార్థనలు చేసుకుంటున్నట్లు కూడా సాక్ష్యం ఉందని ఆర్కియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా తేల్చింది.
ఇక ఆ స్థలం శ్రీరాముడికి చెందినట్లు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయని, ముస్లింలు ప్రార్ధన చేసుకునే మసీదుని కూల్చేశారనే దానికి కూడా సాక్ష్యం ఉందని తెలిపింది.
2.77 ఎకరాల భూమి శ్రీరాముడి పేరు మీద రిజిస్టర్ అయి ఉంది కాబట్టి శ్రీరాముడి గుడి కట్టుకోవచ్చునని తీర్పు ఇచ్చింది.
అలానే కేంద్ర ప్రభుత్వం ఒక ట్రస్ట్ ని ఏర్పాటు చేసి దానికి గుడిని కట్టే బాధ్యతను, తర్వాత ఉండే మెయింటెనెన్స్ ని అప్పగించాలని కోర్టు వెల్లడించింది.
ముస్లింల ప్రార్థన చేసుకునే మందిరాన్ని కూల్చివేశారు కాబట్టి వారికి మసీదు కట్టుకునేందుకు స్థలం ఇవ్వాలని కోర్టు తెలిపింది.
అయోధ్యలోనే ఏదైనా ముఖ్యమైన ప్రదేశంలో మసీదు కట్టుకోవడానికి 5 ఎకరాల ల్యాండ్ రాష్ట్ర ప్రభుత్వం గానీ కేంద్ర ప్రభుత్వం గానీ ఉచితంగా ఇవ్వాలని పేర్కొంది.
ఇక నిర్మోహి అఖారా సంస్థకు ఆ ల్యాండ్ మీద ఎటువంటి హక్కు లేదని.. ఎప్పటి నుంచో పూజలు చేస్తున్నారు కనుక ట్రస్టులో వారికి ఏదైనా మంచి పదవి ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది.
ఈ చారిత్రాత్మక తీర్పుతో అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి పునాది పడింది. ఎంతోమంది హిందువుల కల సాకారం అయ్యింది.