రోడ్డు సైడ్ టీ తాగేవారు జాగ్రత్త.. ప్రాణాలతో ఆడుకుంటున్నారు

మీరు రోడ్డు పక్కన చిన్న చిన్న స్టాల్స్ దగ్గర టీ తాగుతున్నారా? అయితే జాగ్రత్త..

డబ్బు సంపాదించడం కోసం కొంతమంది తినే ఆహారాన్ని, తాగే పానీయాలని కల్తీ చేస్తున్నారు.

సహజంగా కనిపించడం కోసం కెమికల్స్ తో చేసిన రంగులను కలుపుతున్నారు.

ఇటీవల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు హోటల్స్ పై దాడులు నిర్వహించిన సంగతి తెలిసిందే.

తాజాగా హైటెక్ సిటీలో అనేది రోడ్డు పక్క షాప్స్ పేయ్ సెఫ్టీ అధికారులు తనిఖీలు చేపట్టారు.

తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగు చూశాయి.

సహజమైన రంగు రావడం కోసం టీ పొడిలో కెమికల్స్ తో చేసిన రంగులను వాడుతున్నారని తేలింది.

ఈ కెమికల్ కలిపిన రంగులు క్యాన్సర్ కి కారణమవుతాయని ఫుడ్ సేఫ్టీ అధికారులు వెల్లడించారు.

 ఈ క్వాలిటీ, పరిశుభ్రత పాటించకుండా వ్యాపారం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామని అన్నారు.

బిజినెస్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేస్తామని అధికారులు వెల్లడించారు.