ఒళ్లు నొప్పుల నుంచి ఉపశమనం పొందేందుకు పెయిన్ కిల్లర్స్ను ఎక్కువగా వాడుతుంటారు.
అలా వాడితే.. అవి పెయిన్ కిల్లర్స్ కావు.. మన హెల్త్ కిల్లర్స్ అవుతాయి.
దీర్ఘ కాలంలో ఆరోగ్యానికి హాని కలిగించే పెయిన్ కిల్లర్స్కి బదులుగా.. కొత్తిమీర ఆకులు వాడితే బెటర్.
కొత్తిమీరతో చాలా ఉపయోగాల ఉన్నాయి. ఇవి ఒళ్లు నొప్పులు తగ్గించేందుకు కూడా ఉపయోగపడతాయి.
కొత్తిమీర ఆకులను పేస్టులా చేసుకుని నొప్పి ఎక్కడుందో అక్కడ రాయాలి.
అలా రాస్తూ ఉంటే.. ఒళ్లు నొప్పుల నుంచి శాశ్వత విముక్తి కూడా లభిస్తుంది.
కొత్తిమీర కేవలం ఒళ్లు నొప్పులకే కాదు.. మరిన్ని రోగాలను నయం చేసేందుకు ఉపయోగపడుతుంది.
కొత్తిమీర ఆకులు, వేర్ల కషాయం అన్ని కాలేయ వ్యాధులను నయం చేస్తుంది.
కొత్తిమీర ఎండిన ఆకుల పొడిని ఉసిరి పొడితో కలిసి తీసుకుంటే.. రక్తహీనతను తగ్గిస్తుంది.
మంట, గాయం, మూత్ర విసర్జన లాంటి సమస్యలకు చెక్ పెడుతుంది.
అలాగే ఆకలి లేకపోవడం, జీర్ణం సమస్యలను కూడా తగ్గిస్తుంది.