చలికాలంలో ఈ సమస్యలకు చెక్ పెట్టాలంటే.. ఆరెంజ్ జ్యూస్ తీసుకోవాల్సిందే?
ఆరెంజ్ జ్యూస్ తో అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయంటున్నారు ఆరోగ్య నిపుణులు
చలికాలంలో ఆరెంజ్ జ్యూస్ తాగడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని భావిస్తున్నారు.
శీతాకాలంలో నారింజ రసం ఉదయం లేదా మధ్యాహ్నం మాత్రమే తాగాలి. ఈ సమయంలో ఈ జ్యూస్ తాగడం వల్ల అపారమైన ప్రయోజనాలు లభిస్తాయి.
నారింజ రసంలో విటమిన్-ఎ, విటమిన్-బి, విటమిన్-సి, ఫైబర్, కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం, యాంటీఆక్సిడెంట్లు అధిక మొత్తంలో ఉంటాయి.
ప్రతిరోజూ ఒక గ్లాసు ఆరెంజ్ జ్యూస్ తాగడం రోగనిరోధక శక్తికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది.
రోజూ ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల జలుబు, దగ్గు, జ్వరం వంటి సమస్యలు తగ్గుతాయి
నారింజ రసం అధిక కొలెస్ట్రాల్ను నియంత్రించడంలో సహాయపడుతుంది. ఇందులో ఉండే ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిని నియంత్రించడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
చలికాలంలో నీరు తాగడం తగ్గుతుంది. దీని కారణంగా శరీరం డీ హైడ్రేట్ కు గురవుతుంటుంది. ఇది బలహీనత, అలసట, తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలను కలిగిస్తుంది. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే ఆరెంజ్ జ్యూస్ తాగడం వల్ల శరీరం హైడ్రేట్ గా ఉంటుంది
ఆరెంజ్ జ్యూస్ చలికాలంలో చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. దీన్ని తాగడం వల్ల చర్మం మెరుస్తుంది.
ఆరెంజ్ జ్యూస్ శీతాకాలంలో కంటి ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో ఉండే విటమిన్ ఎ కళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే ఈ ఆరెంజ్ జ్యూస్ మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. ఆరెంజ్ జ్యూస్ ను కూడా రెగ్యులర్ గా తాగడం వల్ల గుండె ఆరోగ్యం బేషుగ్గా ఉంటుంది.