మతిమరుపు.. ప్రస్తుతం వయసుతో సంబంధం లేకుండా అందర్ని వేధిస్తున్న సమస్య
గతంలో అయితే కేవలం వయస్సు పైబడిన వారిలోనే కనిపించేది.
కానీ, ఈ రోజుల్లో చిన్నా పెద్దా అనే తేడా లేకుండా మతిమరుపుతో బాధపడుతున్నారు.
చేయాల్సిన పనులు, పెట్టిన వస్తువులు మర్చిపోతూ.. తెగ ఇబ్బంది పడుతుంటారు.
ఇలా మతిమరుపుతో బాధపడే వారు.. ఈ ఆహార పదార్ధాలు తింటే.. మతిమరుపును దూరం చేయొచ్చు.
చేపలు.. చేపల్లో ఎక్కువగా ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ లభిస్తాయి.
ఇది మెదడుకు ఎంతో ఆరోగ్యకరం. చేపలు తినడం వల్ల మతిమరుపు తగ్గుతుంది.
డార్క్ చాక్లెట్.. ఇందులో కెఫిన్, యాంటీ ఆక్సిడెంట్లు, ప్లేవనయిడ్లు మెండుగా ఉంటాయి.
డార్క్ చాక్లెట్ తినడం వల్ల జ్ఞాపక శక్తి, అభిజ్ఞా అభివృద్ధిని మెరుగు పరుస్తుంది.
పసుపు.. దీన్ని యాంటీ బ్యాక్టీరియాగా చెప్పుకుంటాం. మన తినే ఆహారాల్లో పసుపు సరిపడ ఉండేలా చూసుకోండి.
పసుపులో వ్యాధి నిరోధక శక్తి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.
పసుపు వల్ల జ్ఞాపకశక్తి పెరుగుదలతో పాటు మెదడు ఆరోగ్యంగా ఉంటుంది.
మరి ఇంకెందుకు ఆలస్యం.. మీకు మతిమరుపు ఉన్నా లేకపోయినా.. పైన చెప్పిన పదార్థాలు తినడం వల్ల మెదడు ఆరోగ్యాన్ని పెంచుకోండి.