ఆకు కూరలు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు.
కొత్తిమీరలో యాంటీ ఆక్సిడెంట్లు తో పాటు నాడీ వ్యవస్థ మెరుగు పర్చుతుంది. మూర్చ వ్యాధులు దూరం చేస్తుంది.
ఎర్ర బచ్చలి ఆకులు.. విటమిన్ సి, ఫైబరు, రైబో ఫ్లావిన్, క్యాల్షియం పుష్కలంగా ఉంటాయి.
మెంతి ఆకుల్లో విటమిన్ సి, పోటాషియం, ఐరన్, క్యాల్షియం ఉంటాయి.. షుగర్ ని నియంత్రిస్తుంది.
పాలకూరలో ఇందులో ప్రొటీన్లు, ఒమేగా, ఫైబర్ ఉంటాయి. బీపీని కంట్రోల్ చేయడంలో బాగా పనికి వస్తుంది.
బతువా.. ఈ ఆకులో విటమిన్ ఎ, కాల్షియం, పొటాషియం బాగా ఉంటాయి. బతువా తీసుకోవడం వల్ల గ్యాస్, మలబద్దకం, కడుపునొప్పి సమస్యలు తగ్గుతాయి
గోంగూర ఆకులో ఇనుము, కెరోటిన్ పుష్కలంగా ఉంటాయి. జలుబు, తుమ్ముల తగ్గిస్తుంది.
తోటకూర రక్త హీనత తగ్గిస్తుంది. ఇందులో లైసిన్, మిథియోనిన్, అమైనో అమ్లాలు ఉంటాయి.
మునగ వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి.. ఇందులో బాస్వరం, కాల్షియం, థయమన్, విటమిన్ సీ, పోషక పదార్ధాలు అధికంగా ఉంటాయి
కరివేపాకు లో ఎన్నో ఔషదాలు దాగి ఉన్నాయి.. మూత్ర పిండ వ్యాధులను తగ్గిస్తుంది. ఇందులో ఉండే కాల్షియం ఎముకలను గట్టి పరుస్తుంది.