10 మంది డాక్టర్స్ సమానం ఖర్జూరం! దీన్ని తినకుంటే తప్పు చేస్తున్నట్టే!
ఇది ఎండినా, పండినా చాలా బాగుంటుంది. ఎండు ఖర్జూరాను నీటిలో నానబెట్టి తాగితే మంచిదని చెబుతుంటారు
కానీ పచ్చి ఖర్జూర వల్ల కూడా అనేక ప్రయోజనాలున్నాయి. ఖర్జూరాన్ని “ప్రోటీన్స్ పవర్ హౌస్’ అని కూడా పిలుస్తుంటారు
ఇందులో ఫైబర్, విటమిన్స్, ఐరన్, సోడియం, పొటాషియం, జింక్, కాల్షియం లభిస్తుంటాయి.
పచ్చి ఖర్జూరాలను తినడం వల్ల అనీమియా సమస్య దూరమవుతుంది.
గుండె సమస్యలు దరిచేరవు. మలబద్దకం సమస్య ఉన్న వారు ఇవి తింటే మంచి ఫలితం ఉంటుంది.
జలుబు, దగ్గు, జ్వరం వంటి ఫ్లూ వ్యాధులతో పాటు.. ఆస్తమా, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి
బాలింతలు వీటిని తీసుకోవడం వల్ల పాలు ఎక్కువగా పడతాయి
పచ్చి ఖర్జూరంలో బరువును తగ్గించే శక్తి ఉంది. పచ్చి ఖర్జూరం తినడం వల్ల షుగర్ కూడా దరి చేరే అవకాశాలు లేవట.
మెదడుకు కావాల్సిన న్యూట్రీషియన్స్ అందివ్వడంలో ఖర్జూరం దోహదం చేస్తుంది.
కళ్లకు కూడా చాలా మంచిది. రే చీకటిని మాయం చేసే గుణం ఉంది.
రక్త హీనతను, రక్తపోటును తగ్గిస్తుంది
చర్మం ఎప్పుడూ నిగనిగలాడుతూ ఉంటుంది.
గమనిక :
ఇది ప్రాథమిక సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడం ఉత్తమం