Idream media
Idream media
ఇది విన్నారా..? భారతీయ జనతా పార్టీలో ఉన్న నేతను కాంగ్రెస్ యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా నియమించారు. అతడికి ఎందరో కాంగ్రెస్ నాయకులు శుభాకాంక్షలు చెప్పారు కూడా. అదేంటని ఆశ్చర్యపోతున్నారా..? అయితే అందులో ట్విస్ట్ తెలుసుకోవాల్సిందే. మధ్యప్రదేశ్లో కాంగ్రెస్ యువ విభాగ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనందుకు శుభాకాంక్షలు తెలుపుతూ బీజేపీ నేతకు వరుసగా మెసేజ్ వస్తూ ఉన్నాయి. తనకు వస్తున్న ఆ మెసేజ్లు చూసి ఓ ఆ నేత ఆశ్చర్చపోయారు. ఆ నేత పేరు హర్షిత్ సింహ్. అతను కాంగ్రెస్ను వీడి, బీజేపీలో చేరి తొమ్మిది నెలలు అవుతోంది.
అయితే, ఆయనను కాంగ్రెస్ నేతలు తాజాగా యువ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు. ఈ విషయంపై హర్షిత్ స్పందించారు. ‘నేను ఈ ఏడాది మార్చి 10న కాంగ్రెస్ను వీడాను. అయితే, మూడేళ్ల క్రితం యూత్ కాంగ్రెస్ ఎన్నికలకు నామినేషన్ వేశాను. ఆ తర్వాత ఈ ఎన్నికలు వాయిదా పడుతూ వచ్చాయి. నేను బీజేపీలో చేరాక ఆ ఎన్నికల పోటీ నుంచి నన్ను తప్పించాలని కాంగ్రెస్ని కోరాను. కానీ, ఆ పనిని కాంగ్రెస్ నేతలు చేయలేకపోయారు. పార్టీలో లేని వారిని కూడా ఎన్నుకుంటున్నారు’ అని చెప్పారు. కాగా, తాము ఎన్నికలో జరిగిన తప్పుని గుర్తించగానే హర్షిత్ నియామకాన్ని రద్దు చేశామని కాంగ్రెస్ నేతలు చెప్పారు.