iDreamPost

సరదాగా బీచ్ కు వెళ్తే.. ముగ్గుర్ని మింగేసింది !

సరదాగా బీచ్ కు వెళ్తే.. ముగ్గుర్ని మింగేసింది !

సరదాగా బీచ్ వద్ద గడుపుదామని వెళ్లిన ఓ కుటుంబంలో తీరని విషాదం నెలకొంది. సముద్రస్నానం చేస్తున్న ముగ్గుర్ని రాకాసి అలలు బలితీసుకున్నాయి. ఈ విషాద ఘటన శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం ఎన్ జి ఆర్ పురం బీచ్ వద్ద జరిగింది. శనివారం సముద్రస్నానం చేస్తున్న ముగ్గురు గల్లంతవ్వగా.. ఆ ముగ్గురి మృతదేహాలను ఆదివారం గుర్తించారు. మృతులంతా విశాఖజిల్లాకు చెందిన తిరుపతి గణేష్, మేనకోడళ్లుగా గుర్తించారు.

శనివారం ఈ ముగ్గురు సముద్ర స్నానానికి వెళ్లగా.. బీచ్ లో అలల తాకిడికి ముగ్గురు సముద్రంలో కొట్టుకుపోయారు. వెంటనే రెస్క్యూటీమ్ సముద్రంలో గాలించగా.. ఆదివారం ముగ్గురి మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతులు గణేశ్, దీవెన, మానసగా గుర్తించి, వారి కుుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి