iDreamPost
android-app
ios-app

సూపర్-8కు ముందు భారత్​కు కొత్త టెన్షన్.. గెలవడం కంటే ఇదే బిగ్ టాస్క్!

  • Published Jun 18, 2024 | 6:06 PM Updated Updated Jun 18, 2024 | 6:06 PM

టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్ పోరుకు సిద్ధమవుతున్న భారత్​లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలవడం కంటే జట్టుకు ఇదే బిగ్ టాస్క్ కానుంది. దీన్ని రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

టీ20 వరల్డ్ కప్-2024లో సూపర్ పోరుకు సిద్ధమవుతున్న భారత్​లో కొత్త టెన్షన్ మొదలైంది. గెలవడం కంటే జట్టుకు ఇదే బిగ్ టాస్క్ కానుంది. దీన్ని రోహిత్ సేన ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.

  • Published Jun 18, 2024 | 6:06 PMUpdated Jun 18, 2024 | 6:06 PM
సూపర్-8కు ముందు భారత్​కు కొత్త టెన్షన్.. గెలవడం కంటే ఇదే బిగ్ టాస్క్!

టీ20 ప్రపంచ కప్ గ్రూప్ దశలో వరుస విజయాలతో దుమ్మురేపిన భారత్.. ఇప్పుడు అసలు సిసలు సవాల్​కు సిద్ధమవుతోంది. సూపర్-8కు రెడీ అవుతోంది మెన్ ఇన్ బ్లూ. లీగ్ స్టేజ్​లో అమెరికాలోని ట్రిక్కీ పిచ్​లపై బౌలర్లు ఫెయిలైనా ఎలాగోలా నెట్టుకొచ్చింది రోహిత్ సేన. జస్​ప్రీత్ బుమ్రా నేతృత్వంలోని బౌలింగ్ యూనిట్ అద్భుతంగా పెర్ఫార్మ్ చేయడంతో టీమిండియాకు ఎదురులేకుండా పోయింది. బౌలర్లు కూడా ఫెయిలైతే జట్టు పరిస్థితి దారుణంగా ఉండేది. త్వరలో సూపర్-8 మ్యాచ్​లు మొదలవనున్నాయి. ఆఫ్ఘానిస్థాన్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ లాంటి డేంజరస్ టీమ్స్​ను ఎదుర్కోనుంది భారత్. ఆ టీమ్స్​ను ఓడిస్తేనే సెమీస్ బెర్త్ దక్కుతుంది. దీంతో ఇక మీదట జరిగే ప్రతి మ్యాచ్ చావోరేవో కానుంది.

సూపర్-8 కోసం టీమిండియా ఆటగాళ్లు జోరుగా సాధన చేస్తున్నారు. నెట్స్​లో కఠోరంగా శ్రమిస్తున్నారు. ఆడిన మూడు మ్యాచుల్లోనూ ఫెయిలైన టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ గంటల కొద్దీ బ్యాటింగ్ ప్రాక్టీస్ చేశాడు. కోచ్ రాహుల్ ద్రవిడ్ పర్యవేక్షణలో అతడి సాధన సాగింది. తన బలహీనతల్ని దాటేందుకు అతడు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. లీగ్ స్టేజ్​లో అంతగా ఆకట్టుకోని కెప్టెన్ రోహిత్ కూడా నెట్స్​లో చెమటోడ్చాడు. రోకో జోడీ శ్రమించడం చూస్తుంటే రన్స్ చేయాలని ఎంత కసిగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఈ తరుణంలో టీమిండియాలో కొత్త టెన్షన్ మొదలైంది. సూపర్-8 మ్యాచుల్లో నెగ్గడం కంటే ఈ సవాల్​ను దాటడం భారత్​కు బిగ్ టాస్క్​గా మారనుంది. సూపర్ పోరులో భాగంగా రోహిత్ సేన 5 రోజుల వ్యవధిలో మూడు నగరాల్లో మూడు మ్యాచ్​లు ఆడనుంది.

టీమిండియా ఆడే సూపర్-8 మ్యాచులన్నీ కరీబియన్ దీవుల్లోనే జరగనున్నాయి. అయితే మూడు మ్యాచులకు మూడు వేర్వేరు నగరాలు ఆతిథ్యం ఇస్తున్నాయి. ఆఫ్ఘానిస్థాన్​తో ఆడే తొలి సూపర్ పోరుకు బార్బడోస్​లోని కెన్సింగ్టన్ ఓవర్ స్టేడియం హోస్ట్​గా ఉండనుంది. బంగ్లాదేశ్​తో జరిగే రెండో మ్యాచ్​కు ఆంటిగ్వా సిటీలోని సర్ వీవీఎన్ రిచర్డ్స్ స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. ఇక, సూపర్-8 స్టేజ్​లో ఆఖరి మ్యాచ్​లో భాగంగా సెయింట్ లూసియా నగరంలోని డారెన్ సామి క్రికెట్ గ్రౌండ్​లో ఆస్ట్రేలియాతో తాడోపేడో తేల్చుకోనుంది టీమిండియా. అయితే ఈ మూడు సిటీల మధ్య దూరం ఎక్కువ. ఐద్రోజుల వ్యవధిలో మూడు నగరాల్లో పర్యటించి హైటెన్షన్ మ్యాచ్​లు ఆడటం అంటే మామూలు విషయం కాదు. జర్నీ వల్ల ప్లేయర్లు అలసిపోతారు. ప్రయాణ బడలికను దాటి పెర్ఫార్మ్ చేయాల్సి ఉంటుంది. ఇదే విషయంపై తాజాగా కెప్టెన్ రోహిత్ శర్మ రియాక్ట్ అయ్యాడు. ఎక్కువగా ప్రయాణించడం వల్ల అలసిపోతామని.. అయితే దాన్ని సాకుగా చూపబోమన్నాడు. గెలవడం కోసం హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్ పెడతామన్నాడు.

ఇదీ చదవండి: సూపర్-8 కోసం టీమిండియా స్పెషల్ ప్లాన్.. రివీల్ చేసిన జడేజా!