Shubman Gill Released From Squad Vikram Rathour: గిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన భారత బ్యాటింగ్ కోచ్.. అందుకే పంపామంటూ..!

గిల్ వివాదంపై క్లారిటీ ఇచ్చిన భారత బ్యాటింగ్ కోచ్.. అందుకే పంపామంటూ..!

టీ20 వరల్డ్ కప్ మధ్యలో నుంచే ఇంటికి పయనమయ్యాడు టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్. అతడ్ని స్వదేశానికి పంపడానికి ఇవే కారణాలంటూ పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

టీ20 వరల్డ్ కప్ మధ్యలో నుంచే ఇంటికి పయనమయ్యాడు టీమిండియా యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్. అతడ్ని స్వదేశానికి పంపడానికి ఇవే కారణాలంటూ పలు రూమర్స్ వైరల్ అవుతున్నాయి.

టీ20 ప్రపంచ కప్-2024లో సూపర్-8కు చేరుకుంది టీమిండియా. నిన్న కెనడాతో జరగాల్సిన మ్యాచ్ రద్దయింది. అయినా ఆ మ్యాచ్ రిజల్ట్​తో సంబంధం లేకుండా సూపర్-8 బెర్త్​ను కన్ఫర్మ్ చేసుకుంది భారత్. గ్రూప్ దశలో ఆడినట్లే నెక్స్ట్ స్టేజ్​లోనూ ఇరగదీయాలని రోహిత్ సేన భావిస్తోంది. ఆఫ్ఘానిస్థాన్​, ఆస్ట్రేలియాను చిత్తు చేసి సెమీస్​కు దూసుకెళ్లాలని చూస్తోంది. అందుకు కావాల్సిన ప్రణాళికల్ని రచిస్తోంది. కోచ్ రాహుల్ ద్రవిడ్​తో కలసి వ్యూహాలను పన్నడంలో కెప్టెన్ రోహిత్ బిజీ అయిపోయాడు. అయితే భారత క్రికెట్​కు సంబంధించి ఇప్పుడు ఒక అంశం చర్చనీయాంశంగా మారింది. యంగ్ ఓపెనర్ శుబ్​మన్ గిల్​ను పొట్టి కప్పు మధ్యలోనే స్వదేశానికి పంపించింది టీమ్ మేనేజ్​మెంట్. ఉన్నపళంగా అతడ్ని ఎందుకు వెనక్కి పంపారనేది చిక్కు ప్రశ్నగా మారింది.

ట్రావెలింగ్ రిజర్వ్​డ్​గా ఉన్న గిల్​ను స్వదేశానికి పంపడానికి అతడి తప్పే కారణమనే రూమర్స్ వస్తున్నాయి. యూఎస్​ఏ గడ్డ మీద అడుగు పెట్టినప్పటి నుంచి భారత జట్టుతో జర్నీ చేయకుండా.. తన సొంత వ్యాపారాలపై గిల్ ఫోకస్ చేస్తున్నాడని వినిపిస్తోంది. టీమ్​తో ఉంటూ ప్రాక్టీస్ చేస్తూ, మ్యాచ్​ల సమయంలో ఎంకరేజ్ చేయాల్సింది పోయి.. తనకు ఏదీ పట్టనట్టుగా ఉంటున్నాడని సమాచారం. అందుకే గతంలో సౌతాఫ్రికా టూర్ నుంచి ఇషాన్ కిషన్​ను తప్పించిన మాదిరిగా.. ఇప్పుడు గిల్​ను ఇంటికి పంపారనే పుకార్లు మొదలయ్యాయి. దీంతో ఇషాన్​లాగే శుబ్​మన్ కూడా జట్టుకు దూరమైపోతాడేమోనని అతడి అభిమానులు టెన్షన్ పడుతున్నారు. తాజాగా ఈ కాంట్రవర్సీ మీద భారత బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ రియాక్ట్ అయ్యాడు. గిల్​ను వెనక్కి పంపడానికి అసలు రీజన్ ఏంటో అతడు వివరించాడు.

‘మెగా టోర్నీ స్టార్ట్ అవడానికి ముందే వేసుకున్న ప్రణాళిక ఇది. యూఎస్​ఏకు వచ్చే టైమ్​కు నలుగురు ట్రావెలింగ్ రిజర్వ్ ప్లేయర్లు ఉండాలని అనుకున్నాం. అనంతరం వెస్టిండీస్​కు వెళ్లేటప్పుడు ఇద్దరు ఆటగాళ్లను రిలీజ్ చేయాలని ముందే అనుకున్నాం. టీమ్ సెలెక్షన్ సమయంలోనే వేసుకున్న ప్లాన్ ఇది. దాన్నే తాజాగా అమలు చేశాం. అమెరికాలోని పిచ్​లు కొత్తవి. అక్కడ ఆడేటప్పుడు క్రికెటర్లకు గాయాలయ్యే ప్రమాదం ఉంది. అందుకే ముందస్తు జాగ్రత్తగా నలుగురు రిజర్వ్ ఆటగాళ్లను సిద్ధం చేశాం. ఇప్పుడు టీమిండియా సూపర్-8కు చేరుకుంది. ఇక మీదట మ్యాచ్​లు కరీబియన్ మైదానాల్లో జరుగుతాయి. అందుకే గిల్, అవేశ్​ ఖాన్​ను స్వదేశానికి పంపించాం’ విక్రమ్ రాథోడ్ చెప్పుకొచ్చారు. ఇదిలా ఉంటే.. రోహిత్​ను ఇన్​స్టాగ్రామ్​లో గిల్ అన్​ఫాలో చేయడం వివాదాస్పదంగా మారింది. అయితే హిట్​మ్యాన్​తో ఉన్న ఓ పిక్​ను పోస్ట్ చేసి తమ మధ్య ఎలాంటి ఫైట్ జరగలేదని గిల్ క్లారిటీ ఇచ్చాడు.

Show comments