టీడీపీ అధినేత చంద్రబాబు విజయవాడలో అనేక ఆలయాలను కూల్చేశారని దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఆరోపించారు. టీడీపీ హయాంలో దేవాదాయ భూములు వందలాది ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయని, సూరాయపాలెంలో 10 ఎకరాలను బినామీలకు కట్టబెట్టారన్నారు. అలాంటి జీవోలను రద్దు చేసి భూములు స్వాధీనం చేసుకుంటామన్నారు. ఆలయాల భూముల పరిరక్షణకు ఐపీఎస్ అధికారితో కమిటీ వేస్తామన్నారు. భూముల వివరాలను రిజిస్ట్రేషన్ శాఖకు పంపుతామని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అర్చకులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.