India vs Canada Match Washout Sentiment: టీమిండియాకు కలిసొస్తున్న సెంటిమెంట్.. కెనడా మ్యాచ్ రద్దే దానికి ఎగ్జాంపుల్!

టీమిండియాకు కలిసొస్తున్న సెంటిమెంట్.. కెనడా మ్యాచ్ రద్దే దానికి ఎగ్జాంపుల్!

టీ20 వరల్డ్ కప్​-2024లో టీమిండియాకు ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తోంది. దీంతో ఈసారి కప్పు మనదేనని అంతా అంటున్నారు. ఏంటా సెంటిమెంట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్ కప్​-2024లో టీమిండియాకు ఓ సెంటిమెంట్ బాగా కలిసొస్తోంది. దీంతో ఈసారి కప్పు మనదేనని అంతా అంటున్నారు. ఏంటా సెంటిమెంట్? అనేది ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 ప్రపంచ కప్-2024లో భారత జట్టు హవా నడుస్తోంది. ఆడిన మూడు మ్యాచుల్లో నెగ్గిన రోహిత్ సేన.. దర్జాగా సూపర్-8లోకి అడుగు పెట్టింది. కెనడాతో జరగాల్సిన ఆఖరి మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. వరుణుడు ఎంతటికీ కరుణించకపోవడంతో ఒక్క బాల్ కూడా పడకుండానే మ్యాచ్​ రద్దయింది. దీంతో ఇరు జట్లకు ఒక్కో పాయింట్ కేటాయించారు. దీంతో 7 పాయింట్లతో భారత్ టేబుల్ టాపర్​గా నిలిచింది. ఇదే గ్రూప్ నుంచి సూపర్-8కు చేరిన మరో జట్టు యూఎస్​ఏ 5 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. దాయాది పాకిస్థాన్ 2 పాయింట్లతో కెనడా కంటే దిగువన నిలిచింది. గ్రూప్ స్టేజ్ మ్యాచ్​లు పూర్తవడంతో సూపర్-8 మీద రోహిత్ సేన ఫోకస్ చేస్తోంది. ఏయే జట్ల మీద ఎలాంటి ప్లానింగ్​తో ముందుకెళ్లాలి అనేది కసరత్తులు చేస్తోంది. అయితే ఇంకా సూపర్ పోరులు మొదలవక ముందే టీమిండియాదే కప్పు అని అభిమానులు అంటున్నారు.

సూపర్-8తో పాటు నాకౌట్ దశ మ్యాచ్​లు ముగిస్తే గానీ ఫైనల్ చేరే టీమ్స్ మీద క్లారిటీ రాదు. అయితే ఫ్యాన్స్ మాత్రం ఈసారి టీమిండియాదే కప్పు అని నమ్మకంగా చెబుతున్నారు. ఓ సెంటిమెంట్ మన జట్టుకు కలిసొస్తోందని అంటున్నారు. కెనడాతో మ్యాచ్ రద్దవడమే దీనికి ఎగ్జాంపుల్ అని కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి కప్పులో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వాన వల్ల రద్దయినప్పుడు ఛాంపియన్​గా నిలిచిందని గుర్తు చేస్తున్నారు. టీ20 వరల్డ్ కప్-2007లో మహేంద్ర సింగ్ ధోని సారథ్యంలోని టీమిండియా విజేతగా నిలిచింది. ఆ ఏడాది జరిగిన చాలా విషయాలు ఇప్పుడు మళ్లీ రిపీట్ అవుతున్నాయి. తొలి టీ20 ప్రపంచ కప్​లో స్కాట్లాండ్​తో భారత జట్టు ఆడాల్సిన మ్యాచ్ వర్షం వల్ల ఒక్క బంతి కూడా పడకుండానే రద్దయింది. ఆ టోర్నీలో టీమిండియాలో శ్రీశాంత్ రూపంలో ఓ కేరళ ప్లేయర్ ఉన్నాడు. ఇదే ఇప్పుడు పునరావృతం అయింది.

ప్రస్తుత ప్రపంచ కప్​లో కెనడాతో భారత్ ఆడాల్సిన మ్యాచ్ వర్షం కారణంగానే రద్దయింది. ఈసారి టీమిండియా స్క్వాడ్​లో సంజూ శాంసన్ రూపంలో కేరళ నుంచి ఓ ఆటగాడు ఉన్నాడు. దీంతో టీమిండియాకు అన్ని శకునాలు కలిసొస్తున్నాయని చెబుతున్నారు ఫ్యాన్స్. అరంగేట్ర ప్రపంచ కప్​లో, అలాగే ప్రస్తుత వరల్డ్ కప్​లోనూ ఆతిథ్య దేశాలు తొలి మ్యాచుల్లో విజయాలు సాధించాయని అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. అదే విధంగా మ్యాచ్ టై అయిన తర్వాత పాకిస్థాన్ ఓడిన సంగతిని గుర్తు చేస్తున్నారు. అప్పుడు బౌలౌట్​లో భారత్​పై ఓడిన పాక్.. ఈసారి యూఎస్​ఏ చేతుల్లో సూపర్ ఓవర్​లో మట్టికరిచింది. ఆతిథ్య దేశం మీద టీమిండియా లెఫ్టార్మ్ పేసర్స్ 4 వికెట్లు తీయడం గురించి కూడా చెబుతున్నారు. ఇలా అరంగేట్ర ప్రపంచ కప్​లోని చాలా సెంటిమెంట్లు ఇప్పుడు రిపీట్ అవుతున్నాయని.. కాబట్టి ఈసారి కప్పు రోహిత్ సేనదేనని బల్ల గుద్ది చెబుతున్నారు అభిమానులు. మరి.. టీమిండియా కప్పు కొడుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

Show comments